తెలంగాణలో తిరుగులేని నేత, ముఖ్యమంత్రి కేసీఅర్ కు వ్యతిరేకంగా ఎంతటి మాటైనా మాట్లాడగల నేత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మధ్య కొంతకాలంగా సైలెంట్ అయిన రేవంత్ కొంత కాలం క్రితం ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తో బాగానే సున్నం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ కొందరు టీఆర్ఎస్ నేతలు, గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తెలంగాణా యంత్రాంగం మీద, పోలీసుల మీద తనకు నమ్మకం లేదని అన్నారు.
అలాగే తనకు కేంద్ర బలగాల ద్వారా భద్రత కల్పించాలని హై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అందరూ డేర్ అండ్ డాషింగ్ గా పేరున్న రేవంత్ ఏమిటి అలా చేయడమేమిటి అని విస్తుపోయారు. ఆయన పిటిషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు రేవంత్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆయనకు అదనపు భద్రత కల్పించాలని మహబూబ్ నగర్ పోలీసులను ఆదేశించింది.

EmoticonEmoticon