ఎన్నికల ప్రచారానికి చెన్నై రానున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని విద్యార్థుల సమాఖ్య ప్రకటించింది. శాసనసభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సోనియాగాంధీ గురువారం నగరానికి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీలంకలో ఈళం తమిళుల వూచకోతకు, శ్రీలంకకు ఆయుధ సహాయాన్ని అందించడానికి సోనియాగాంధీ ప్రధాన కారకురాలని, అందువల్ల ఆమె రాకను పురస్కరించుకుని నల్లజెండాలతో నిరసన తెలుపుతామన్నారు. దీనికోసం అనుమతి కోరుతూ నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో విద్యార్థుల సమాఖ్య కన్వీనర్లు పార్వైదాసన్, లయోలా మణి తదితరులు వినతిపత్రం అందజేశారు.
EmoticonEmoticon