విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు తేదేపా నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా చినబాబు లోకేష్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ తనకి ఓ భారీ ఆఫర్ ఇచ్చినట్టు చెప్పారాయన. తేదేపాలో చేరితే అమరావతిలో ఎకరం భూమి, 20 కోట్లు క్యాష్ ముట్టజెపుతామని ఆఫర్ చేసినట్టు ఆరోపించారాయన. కేవలం ఇవే కావు.. భవిష్యత్లో కొన్ని కాంట్రాక్టులు అప్పజెపుతామని ఆశ చూపారని తెలిపారు. ఈ ఫిరాయింపు ప్రయత్నం వెనక సీఎం చంద్రబాబు ప్రోత్సాహం ఉందని అన్నారు.
ఢిల్లీ వెళ్లే ముందే నాకు ఫోన్ వచ్చింది. పూర్తి విషయాలు మాట్లాడుకోవడానికి లోకేష్తో భేటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. సీఎం కుర్చీ ఇస్తారా? అని అడిగితే వెంటనే ఫోన్ పెట్టేశారని ఆయన అన్నారు. అయినా నేను అవినీతి ఎమ్మెల్యేగా ఉండదలుచుకోలేదని ముత్యాలనాయుడు అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు 150 ఎకరాల కోసం తేదేపాలో చేరారని విమర్శించారు. బాబు దిగజారుడు తనాన్ని అసహ్యించుకుంటూ ఆ పార్టీకే చెందిన ఒక సర్పంచ్ ప్రలోభాలకు గురవ్వద్దని తనని హెచ్చరించారని ముత్యాలు తెలిపారు.

EmoticonEmoticon