చర్చకు తెర తీసిన సరి-బేసి విధానం

07:53:00
కేంద్ర మాజీ మంత్రి,బిజెపి సీనియర్ నేత విజయ్ గోయల్ కు జరిమానా విదించారు. డిల్లీలో సరి,బేసి సంఖ్యల ఆదారంగా ట్రాపిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన సందర్బంగా ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నారు.ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని ఆయన ఆరోపించారు.దీనికి నిరసనగా ఈ సరి,బేసి సంఖ్యల పద్దతికి నిరసన తెలుపుతానని ప్రకటించారు.ఆ ప్రకారం సోమవారం నాడు నిబంధనను ఉల్లంఘించి కారు నడిపారు. అప్పుడు డిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ బిజెపి నేత విజయ్ గోయాల్ కు పువ్వు ఇచ్చి నిబందన ఉల్లంఘించవద్దని కోరారు.అయినా ఆయన వినలేదు.దాంతో పోలీసులు విజయ్ గోయల్ కు రెండువేల జరిమానా విదించారు.సామాన్యులకు ఇంత మొత్తం చాలా ఎక్కువని ఆయన అన్నారు. ట్రాపిక్ సిస్టమ్ కారణంగా ప్రజలు రెండేసి కార్లు కొనుక్కోవలసిన అవసరం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

Share this

Related Posts

Previous
Next Post »