ఏపీ భవన్ మా ఆస్తి. అది మాకే దక్కాలి అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్కి లేఖ రాశారాయన. మా కల్చర్ కోసం భవంతులు నిర్మించుకుంటాం. ముందు ఏపీ నుంచి స్వాధీనపర్చండి అంటూ లేఖలో పేర్కొన్నారు. “విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్స్టిట్యూట్ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు“ అంటూ సీఎం స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు.
నాడు మద్రాస్ నుంచి ఆంధ్రా వేరుపడింది కాబట్టి ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సింది. లేదూ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సింది. చరిత్రను, ఆధారాల్ని పరిశీలించి ఏపీ భవన్ని మాకు ఇచ్చేయాల్సిందే… అంటూ లేఖలో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసుల కోసం ఢిల్లీలో వేరొక స్థలం కేటాయించుకోండని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. జనాభా ధామాషా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.

EmoticonEmoticon